హంసనామక పరమాత్మునిచే ప్రవర్తితమైన, హంసనామక పరమాత్ముడే మూల శ్రోతస్సుగా కలిగియున్నతువంటి భవ్యమైన, దివ్యమైన, ఉజ్వలమైన పరంపర శ్రీ ఉత్తరాదిమఠము. నిర్దిష్టమైన కేంద్రం, కాలం, దేశం, గోత్రం, వంశం, వ్యక్తులకు సీమితం కానటువంటి పరమహంసుల పరమ పవిత్రమైన పరంపరయే శ్రీ ఉత్తరాదిమఠము.
హంస నామకుడైన శ్రీహరియే ఏ ఉద్దేశ్యాన్ని వుంచి ఈ భవ్యమైన పరంపరాను ప్రవర్తించేనో ఆ ఉద్దేశ్యాన్ని అప్పటినుండి ఇప్పటివరకు నిరంతరంగా, సక్రమంగా, నిర్విరామంగా దీక్షాబద్దులై ఈ పీఠంలో విరాజమానులైనటువంటి ప్రతి యొక్క కీర్తి, మహాత్మ్యాలకు ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు.
ఈ పీఠంలో విరాజమానులైనతువంటి వారిలో శ్రీ మదానంద తీర్ధ భగవత్పాదాచార్యుల సన్నిధానము విశేషముగా ఉన్నది. ఈ విషయము మనకు పేఠాదిపత్య్యాన్ని అధిష్టిమ్చినతువంటి యతివరేణ్యుల విలక్షణమైన తప:శక్తి మరియు వ్యక్తిత్వముచే స్పష్టంగా తెలుస్తుంది. అందరి ప్రత్యక్షానుభావమూ దీనికి ప్రమాణము.
ఈ మహాపీథంలొ ప్రధానంగా రెండు విధాలుగా భగవంతుడి ఆరాధన నడుస్తుంది .
౧. బ్రహ్మ కరార్చిత మరియు మధ్వకరార్చిత ప్రతిమల పూజారూపమైన ఆరాధన మరియు
౨. సచ్చాస్త్ర పాఠము, ప్రవచనము, సత్సింద్దాంత స్థాపనము, పరమత నిరాకరణ పూర్వక స్వమత స్థాపన రూపమైన భగవదారాధన.
మాధ్వ సిద్దాంతానికి ఈ పీఠము ఒక మూల స్తంభము. ఇప్పటివరకు ఈ పీఠం లో అలంకృతులైన ప్రతి యొక్క పీఠాధిపతి నిరంతరముగా పాఠ ప్రవచనములు, ప్రతివాది నిగ్రహము, శిష్యుల నిర్మాణము, గ్రంధ రచన, తప్త ముద్రాదారణ మొ. కార్యములచే మాధ్వప్రపంచాన్ని సంవత్భారితంగా, సుభద్రంగా తీర్చిదిద్దినారు. ఇప్పటికీ ఈ పరంపరా అవిచ్చిన్నముగా, అవ్యాహతంగా నడుస్తుంది.