Sunday, November 1, 2009
ఉత్తరాదిమఠము
Wednesday, December 17, 2008
పుట్టుక గురించి నాకు కలిగిన అభిప్రాయము
Tuesday, December 9, 2008
రామాయణములోని ఘట్టములలో పద్దెనిమిది విషయాలలో శ్రీరాముని పురుషోత్తమత్వము ఈవిధముగా స్పష్టము కాగలదు
౦౨. అహల్యను గౌతమ మహర్షి శపించినప్పుడు ఆమె శాపాంతమును గురించి తెలియచెయ్యమని ప్రార్ధింపగా గౌతముడు అనేక సహస్రవర్షానంతరమున ఆ పరమేశ్వరుడు శ్రీరాముడుగానవతరించి ఈవనమునకు రాగాలడనియు, అప్పుడు ఆమహాపురుషుని వల్ల అహల్య పవిత్రురాలు కాగాలదనియు గౌతముడు ముందుగానే రాముని దివ్య సంభవత్వమును గురించి ముచ్చతించుట.
౦౩. దానికి తగినట్లుగానే దశరధుని పుత్రకామేష్టి పూర్తి కాగానే అగ్ని కుండము నుండి ప్రాజాపత్య పురుషుడు దివ్య పాయసముతో సాక్షాత్కరించి దశరధుని కాపాయసము నివ్వగా దానిని కౌసల్య, సుమిత్ర, కైక, అను ముగ్గురు భార్యలు భుజింప వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఉదైంచుట.
౦౪. విశ్వామిత్రుడు తన యాగసంరక్షనార్ధమై రాముని పంపవలసినదని దశరధుని కోరినపుడు విశ్వామిత్రుడు ఆసభలో సత్యపరాక్రముడును, మహాత్ముడును అగు రాముని విశిష్టతను నేనే ఎరింగినవాడను. తపశ్శాలియగు నీ వశిష్ట మునీంద్రుడు ఎరుగును. తపోనిష్టులగు మునులుగూడ ఎరుంగుదురు. అని రాముని ప్రశంసించుట.
౦౬. శాపగ్రస్తురాలైన అహల్యను శాపవిముక్తురాలుగా చేయుట, అంతట అహల్య రాముని పరమేస్వరునిగా స్తుతించుట.
౦౭. అయిదు వేలమంది మహాయోధులు ఎత్తలేని శివధనుస్సును తేలికగా ఎత్తి భంగము చేయుట.
౦౮. ఇరువది యొక్క సారి క్షత్రియ నిర్మూలనము చేసిన పరశురాముడు అను మహాశురుని అనాయాసముగా జయించుట.
౦౯. శరభంగసుతిక్షనాది మహర్షులనేకులు శ్రీరాముని తమ తమ ఆశ్రమములకు గోంపోయి పరమేస్వరునిగా స్తుతించుట.
౧౦. జటాయువుకు అంత్యక్రియలు గావించి అతనియందుగల వాత్యల్యముచే అతనికి ఎవరికిని సాధ్యముకాని ఉత్తమ లోకప్రాప్తిని అనుగ్రహించుట.
౧౧. చతుర్ధ శహస్ర రాక్షసుబలముతో వచ్చిన ఖరదూషనాది రాక్షసులను త్రుటి కాలములో నొక్కడు వధించుట.
౧౨. సుగ్రీవునకు విశ్వాసము కలిగించుటకై ఒకే బాణముతో సప్త తాళముల పడగొట్టుట.
౧౩. పర్వతాకారముగనున్న దుందుభికంకాలమును పాదాంగుష్టముతో దశయోజన దూరమునకు ఎగురగోట్టుట.
౧౪. రావణుని చిన్ని పురువుగా పట్టుకొని నాల్గు సముద్రములలోను ముంచి తేల్చిన అఖండ బలశాలి యగు వాలిని సంహరించుట.
౧౫. విభీషణ శరణాగతి సన్నివేశములో సుగ్రీవుడు విభిషనుని స్వికరింపవద్దని అడ్డుపడగా రాముడు తానూ ఇచ్ఛయించినచో సర్వలోకములను నశింప చేయగలను అని వ్యక్తపరచుట.
౧౬. చివరకు రావణాది మహారాక్షసులను మూలబలమును కూడా అవలీలగా సంహరించుట.
౧౭. రావణుడు యుధములో పడిపోయి రామున్ని చూచి ఎవ్వని పరాక్రమము వలన రాక్షసులందరూ మరనించిరో అట్టి శ్రీరాముడు శ్రీమన్నారాయనుడే అగును అని కీర్తించుట.
౧౮. రావనవధానంతరము సీత అగ్ని పరీక్షలో విజయవంతముకాగా, అగ్ని దేముడు దేవతాగనముతోను బ్రహ్మ దేవునితోను సాక్షాత్కరిమ్చగా బ్రహ్మ దేముడు రామునితో 'రామా! నీవు శ్రీమన్నారయనుడవు, చక్రమును ధరించి యుందువు. నీవు అక్షరమగు పరబ్రహ్మవు, నీకు ఆది లేదు. జగములు ఉన్నపుడును, లయమైన తరువాతను నీవు నిలిచియుమ్డువు. నీవు యింద్రియములకు అధిపతివి, పురుషుడగు జేవుడును, పురుషోత్తముడగు ఈశ్వరుడును గూడ నీవే. ఈ సీతయే మహాలక్ష్మి, నీవే ప్రజాపతివి. రావణుని వధింప మనుష్యుడవైతివి. నీ భక్తులకు సకలములగు కోరికలను సిద్ధించుచూ అతి పురాతనుడవగు నిన్నెవరు భక్తితో పూజించి, తలచుచుండురో, వారీలోకమందును పరలోకమునందును గూడ కోరినవానిని పొందగలరు.
ఇట్టి సన్నివేశము లెన్నియో రాముని పురుషోత్తమత్వమును ధర్మనిగ్రహత్వమును చాటుచున్నవి.
జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ