Thursday, November 27, 2008

వాల్మీకి రామాయణం లో రాముని వర్ణన

వాల్మీకి రామాయణం లో రాముని వర్ణన
బాలకాండలో, పరశురాముడు రాముని గురించి,
అక్షయం మధుహంతారం జానామి త్వాం సురోథ్థమమ్
రామా! నిను నాశనము లేనివానినిగాను, మధువను రాక్షసుని జంపినవానినిగను, దేవతలలో శ్రేస్టునిగాను కూడా యెరుగుదును.
అయోధ్యకాండలో సుమిత్ర రాముని గురించి -
దైవతం దేవతానాం చ భూతానాం భూతసత్తమ:
దేవతలకు కూడా దేవుడవు. భూతములకు కూడా శ్రేష్టమగు భూతమవు.
అరణ్యకాండలో శబరీ రాముని దేవవర (దేవతలలో శ్రేష్టుడు).
కిష్కిమ్ధకామ్డలో తార రాముని గురించి
మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త:
మానవుల దేహములందలి సామాన్య తేజమును విడిచి, దివ్య దేహములందుమ్డు తేజమును ధరించి యున్నాడు.

సుందరకాండలో హనుమంతుడు రాముని .....
లోకత్రయనాయక............. లోకత్రయమునకు నాయకుడని ప్రశంసించెను.
యుద్దకాండలో మాల్యవంతుడు రాముని గురించి
విష్ణుం మన్యామహిదేవం మానుషం దేహ మాస్థితం
మనుష్య దేహమును స్వీకరించిన విష్ణు దేవునిగా తలచుచున్నాను.
రావణాసురుడు రాముని గురించి
తం మన్యే రాఘవం వీరం నారాయనంనామయం
రాఘవుడు అనామయుడైన నారాయణుడు అని తలచుచున్నాడు.
బ్రహ్మ దేవుడే రాముని గురించి
భవాన్నారాయనో దేవ: ......నీవు నారాయనుడవే అని ప్రశంసించెను
రాముడు కేవలము పరమేశ్వరుడే అని భోధపడుతున్నది .........
అని వాల్మీకి రామాయణంలో రాముని వర్ణన వున్నది అని శ్రీ విద్యా శంకర భారతీ స్వాముల వారు వర్ణించిరి

No comments: