Tuesday, December 9, 2008

౧౬. చివరకు రావణాది మహారాక్షసులను మూలబలమును కూడా అవలీలగా సంహరించుట.

౧౭. రావణుడు యుధములో పడిపోయి రామున్ని చూచి ఎవ్వని పరాక్రమము వలన రాక్షసులందరూ మరనించిరో అట్టి శ్రీరాముడు శ్రీమన్నారాయనుడే అగును అని కీర్తించుట.

౧౮. రావనవధానంతరము సీత అగ్ని పరీక్షలో విజయవంతముకాగా, అగ్ని దేముడు దేవతాగనముతోను బ్రహ్మ దేవునితోను సాక్షాత్కరిమ్చగా బ్రహ్మ దేముడు రామునితో 'రామా! నీవు శ్రీమన్నారయనుడవు, చక్రమును ధరించి యుందువు. నీవు అక్షరమగు పరబ్రహ్మవు, నీకు ఆది లేదు. జగములు ఉన్నపుడును, లయమైన తరువాతను నీవు నిలిచియుమ్డువు. నీవు యింద్రియములకు అధిపతివి, పురుషుడగు జేవుడును, పురుషోత్తముడగు ఈశ్వరుడును గూడ నీవే. ఈ సీతయే మహాలక్ష్మి, నీవే ప్రజాపతివి. రావణుని వధింప మనుష్యుడవైతివి. నీ భక్తులకు సకలములగు కోరికలను సిద్ధించుచూ అతి పురాతనుడవగు నిన్నెవరు భక్తితో పూజించి, తలచుచుండురో, వారీలోకమందును పరలోకమునందును గూడ కోరినవానిని పొందగలరు.

ఇట్టి సన్నివేశము లెన్నియో రాముని పురుషోత్తమత్వమును ధర్మనిగ్రహత్వమును చాటుచున్నవి.

జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ

No comments: