౦౧. బ్రహ్మాది దేవతలందరు రావణాసురుని బాధలు పడలేక శ్రీమన్నారాయణుని శరణువేడగా కౌసల్యాదశరధులకు రామ పుత్రుడుగా అవతరించేదనని చెప్పి శ్రీమన్నారాయణుడు అభయమిచ్చి తానే రాముడుగా జన్మించుట.
౦౨. అహల్యను గౌతమ మహర్షి శపించినప్పుడు ఆమె శాపాంతమును గురించి తెలియచెయ్యమని ప్రార్ధింపగా గౌతముడు అనేక సహస్రవర్షానంతరమున ఆ పరమేశ్వరుడు శ్రీరాముడుగానవతరించి ఈవనమునకు రాగాలడనియు, అప్పుడు ఆమహాపురుషుని వల్ల అహల్య పవిత్రురాలు కాగాలదనియు గౌతముడు ముందుగానే రాముని దివ్య సంభవత్వమును గురించి ముచ్చతించుట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment