Tuesday, December 9, 2008

౦౫ పదమూడు సంవత్సరములు వయస్సుగల రాముడు మారీచ సుభాహులను హత మొనర్చుట.
౦౬. శాపగ్రస్తురాలైన అహల్యను శాపవిముక్తురాలుగా చేయుట, అంతట అహల్య రాముని పరమేస్వరునిగా స్తుతించుట.
౦౭. అయిదు వేలమంది మహాయోధులు ఎత్తలేని శివధనుస్సును తేలికగా ఎత్తి భంగము చేయుట.
౦౮. ఇరువది యొక్క సారి క్షత్రియ నిర్మూలనము చేసిన పరశురాముడు అను మహాశురుని అనాయాసముగా జయించుట.
౦౯. శరభంగసుతిక్షనాది మహర్షులనేకులు శ్రీరాముని తమ తమ ఆశ్రమములకు గోంపోయి పరమేస్వరునిగా స్తుతించుట.
౧౦. జటాయువుకు అంత్యక్రియలు గావించి అతనియందుగల వాత్యల్యముచే అతనికి ఎవరికిని సాధ్యముకాని ఉత్తమ లోకప్రాప్తిని అనుగ్రహించుట.
౧౧. చతుర్ధ శహస్ర రాక్షసుబలముతో వచ్చిన ఖరదూషనాది రాక్షసులను త్రుటి కాలములో నొక్కడు వధించుట.

No comments: