Tuesday, December 9, 2008

౦౩. దానికి తగినట్లుగానే దశరధుని పుత్రకామేష్టి పూర్తి కాగానే అగ్ని కుండము నుండి ప్రాజాపత్య పురుషుడు దివ్య పాయసముతో సాక్షాత్కరించి దశరధుని కాపాయసము నివ్వగా దానిని కౌసల్య, సుమిత్ర, కైక, అను ముగ్గురు భార్యలు భుజింప వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఉదైంచుట.

౦౪. విశ్వామిత్రుడు తన యాగసంరక్షనార్ధమై రాముని పంపవలసినదని దశరధుని కోరినపుడు విశ్వామిత్రుడు ఆసభలో సత్యపరాక్రముడును, మహాత్ముడును అగు రాముని విశిష్టతను నేనే ఎరింగినవాడను. తపశ్శాలియగు నీ వశిష్ట మునీంద్రుడు ఎరుగును. తపోనిష్టులగు మునులుగూడ ఎరుంగుదురు. అని రాముని ప్రశంసించుట.

No comments: