Wednesday, December 17, 2008
పుట్టుక గురించి నాకు కలిగిన అభిప్రాయము
Tuesday, December 9, 2008
రామాయణములోని ఘట్టములలో పద్దెనిమిది విషయాలలో శ్రీరాముని పురుషోత్తమత్వము ఈవిధముగా స్పష్టము కాగలదు
౦౨. అహల్యను గౌతమ మహర్షి శపించినప్పుడు ఆమె శాపాంతమును గురించి తెలియచెయ్యమని ప్రార్ధింపగా గౌతముడు అనేక సహస్రవర్షానంతరమున ఆ పరమేశ్వరుడు శ్రీరాముడుగానవతరించి ఈవనమునకు రాగాలడనియు, అప్పుడు ఆమహాపురుషుని వల్ల అహల్య పవిత్రురాలు కాగాలదనియు గౌతముడు ముందుగానే రాముని దివ్య సంభవత్వమును గురించి ముచ్చతించుట.
౦౩. దానికి తగినట్లుగానే దశరధుని పుత్రకామేష్టి పూర్తి కాగానే అగ్ని కుండము నుండి ప్రాజాపత్య పురుషుడు దివ్య పాయసముతో సాక్షాత్కరించి దశరధుని కాపాయసము నివ్వగా దానిని కౌసల్య, సుమిత్ర, కైక, అను ముగ్గురు భార్యలు భుజింప వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఉదైంచుట.
౦౪. విశ్వామిత్రుడు తన యాగసంరక్షనార్ధమై రాముని పంపవలసినదని దశరధుని కోరినపుడు విశ్వామిత్రుడు ఆసభలో సత్యపరాక్రముడును, మహాత్ముడును అగు రాముని విశిష్టతను నేనే ఎరింగినవాడను. తపశ్శాలియగు నీ వశిష్ట మునీంద్రుడు ఎరుగును. తపోనిష్టులగు మునులుగూడ ఎరుంగుదురు. అని రాముని ప్రశంసించుట.
౦౬. శాపగ్రస్తురాలైన అహల్యను శాపవిముక్తురాలుగా చేయుట, అంతట అహల్య రాముని పరమేస్వరునిగా స్తుతించుట.
౦౭. అయిదు వేలమంది మహాయోధులు ఎత్తలేని శివధనుస్సును తేలికగా ఎత్తి భంగము చేయుట.
౦౮. ఇరువది యొక్క సారి క్షత్రియ నిర్మూలనము చేసిన పరశురాముడు అను మహాశురుని అనాయాసముగా జయించుట.
౦౯. శరభంగసుతిక్షనాది మహర్షులనేకులు శ్రీరాముని తమ తమ ఆశ్రమములకు గోంపోయి పరమేస్వరునిగా స్తుతించుట.
౧౦. జటాయువుకు అంత్యక్రియలు గావించి అతనియందుగల వాత్యల్యముచే అతనికి ఎవరికిని సాధ్యముకాని ఉత్తమ లోకప్రాప్తిని అనుగ్రహించుట.
౧౧. చతుర్ధ శహస్ర రాక్షసుబలముతో వచ్చిన ఖరదూషనాది రాక్షసులను త్రుటి కాలములో నొక్కడు వధించుట.
౧౨. సుగ్రీవునకు విశ్వాసము కలిగించుటకై ఒకే బాణముతో సప్త తాళముల పడగొట్టుట.
౧౩. పర్వతాకారముగనున్న దుందుభికంకాలమును పాదాంగుష్టముతో దశయోజన దూరమునకు ఎగురగోట్టుట.
౧౪. రావణుని చిన్ని పురువుగా పట్టుకొని నాల్గు సముద్రములలోను ముంచి తేల్చిన అఖండ బలశాలి యగు వాలిని సంహరించుట.
౧౫. విభీషణ శరణాగతి సన్నివేశములో సుగ్రీవుడు విభిషనుని స్వికరింపవద్దని అడ్డుపడగా రాముడు తానూ ఇచ్ఛయించినచో సర్వలోకములను నశింప చేయగలను అని వ్యక్తపరచుట.
౧౬. చివరకు రావణాది మహారాక్షసులను మూలబలమును కూడా అవలీలగా సంహరించుట.
౧౭. రావణుడు యుధములో పడిపోయి రామున్ని చూచి ఎవ్వని పరాక్రమము వలన రాక్షసులందరూ మరనించిరో అట్టి శ్రీరాముడు శ్రీమన్నారాయనుడే అగును అని కీర్తించుట.
౧౮. రావనవధానంతరము సీత అగ్ని పరీక్షలో విజయవంతముకాగా, అగ్ని దేముడు దేవతాగనముతోను బ్రహ్మ దేవునితోను సాక్షాత్కరిమ్చగా బ్రహ్మ దేముడు రామునితో 'రామా! నీవు శ్రీమన్నారయనుడవు, చక్రమును ధరించి యుందువు. నీవు అక్షరమగు పరబ్రహ్మవు, నీకు ఆది లేదు. జగములు ఉన్నపుడును, లయమైన తరువాతను నీవు నిలిచియుమ్డువు. నీవు యింద్రియములకు అధిపతివి, పురుషుడగు జేవుడును, పురుషోత్తముడగు ఈశ్వరుడును గూడ నీవే. ఈ సీతయే మహాలక్ష్మి, నీవే ప్రజాపతివి. రావణుని వధింప మనుష్యుడవైతివి. నీ భక్తులకు సకలములగు కోరికలను సిద్ధించుచూ అతి పురాతనుడవగు నిన్నెవరు భక్తితో పూజించి, తలచుచుండురో, వారీలోకమందును పరలోకమునందును గూడ కోరినవానిని పొందగలరు.
ఇట్టి సన్నివేశము లెన్నియో రాముని పురుషోత్తమత్వమును ధర్మనిగ్రహత్వమును చాటుచున్నవి.
జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ
Friday, December 5, 2008
రామ స్వరూప నిర్ణయము
ఇత్యాదినా ౧౬ ఉత్తమ గుణములు గల మహాపురుషుడు ఎవరు అని వాల్మికి మహర్షి నారదముని ని ప్రశ్నించగా ఆ ౧౬ గుణములు గల వ్యక్తీ కేవలము పరమేశ్వరుడు తప్ప ఇంకొకరు కాజాలరు. అందుకు నారదుడు 'ఇక్ష్వాకు వంశ ప్రభవ: రామ:' అని వక్కానించెను. ఈ ఉపక్రమము వల్ల రాముడే పరమేశ్వరుడు అని తెలుచున్నది. ఉపసంహారము లో బ్రహ్మ దేవుడు రాముని
'తవాహం పూర్వకే భావే పుత్ర: పరపురంజయ: ' సంక్షిప్య చ పురా లోకా న్యాయయా స్వయ మేవ హి
మహార్ణ వే శాయనోప్సు మాం త్వం పూర్వ మజీజన: పద్మే దివ్యేర్కసంకాశే నాభ్యా ముత్పాద్య మామపి
ఈవిధంగా సర్వజగత్కారణమైన ప్రజాపతికి జనకత్వేన రాముడు స్తుతింపబడుటచే రాముని పరమేశ్వరత్వము స్పష్టమగుచున్నది.
Friday, November 28, 2008
రామో విగ్రహవాన్ ధర్మ:
Thursday, November 27, 2008
వాల్మీకి రామాయణం లో రాముని వర్ణన
బాలకాండలో, పరశురాముడు రాముని గురించి,
అక్షయం మధుహంతారం జానామి త్వాం సురోథ్థమమ్
రామా! నిను నాశనము లేనివానినిగాను, మధువను రాక్షసుని జంపినవానినిగను, దేవతలలో శ్రేస్టునిగాను కూడా యెరుగుదును.
అయోధ్యకాండలో సుమిత్ర రాముని గురించి -
దైవతం దేవతానాం చ భూతానాం భూతసత్తమ:
దేవతలకు కూడా దేవుడవు. భూతములకు కూడా శ్రేష్టమగు భూతమవు.
అరణ్యకాండలో శబరీ రాముని దేవవర (దేవతలలో శ్రేష్టుడు).
కిష్కిమ్ధకామ్డలో తార రాముని గురించి
మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త:
మానవుల దేహములందలి సామాన్య తేజమును విడిచి, దివ్య దేహములందుమ్డు తేజమును ధరించి యున్నాడు.
సుందరకాండలో హనుమంతుడు రాముని .....
లోకత్రయనాయక............. లోకత్రయమునకు నాయకుడని ప్రశంసించెను.
యుద్దకాండలో మాల్యవంతుడు రాముని గురించి
విష్ణుం మన్యామహిదేవం మానుషం దేహ మాస్థితం
మనుష్య దేహమును స్వీకరించిన విష్ణు దేవునిగా తలచుచున్నాను.
రావణాసురుడు రాముని గురించి
తం మన్యే రాఘవం వీరం నారాయనంనామయం
రాఘవుడు అనామయుడైన నారాయణుడు అని తలచుచున్నాడు.
బ్రహ్మ దేవుడే రాముని గురించి
భవాన్నారాయనో దేవ: ......నీవు నారాయనుడవే అని ప్రశంసించెను
రాముడు కేవలము పరమేశ్వరుడే అని భోధపడుతున్నది .........
అని వాల్మీకి రామాయణంలో రాముని వర్ణన వున్నది అని శ్రీ విద్యా శంకర భారతీ స్వాముల వారు వర్ణించిరి
Sunday, November 16, 2008
శ్రీ రామ శబ్దము యొక్క అర్ధము
రామ అనగా రమయతి సర్వాన్ గునైరితి రామ: అను వ్యుత్పత్తిని బట్టి తన గుణములచే నందరిని అనందపరచువాడు కనుక రాముడు అని అర్ధము. రామంతేస్మిన్ సర్వే జనా: గునైరితి రామ: అను వ్యుత్పత్తిని బట్టి గుణముల చేత జనులందరు ఎవరియందు ఆనందించు చుమ్దురో అట్టివాడు రాముడు అని అర్ధము. ఇంకను రామరాహస్యోపనిషత్తులో రామ ఏవ పరం బ్రహ్మ రామ ఏవ పరం తప:రామ ఏవ పరం తత్వం శ్రీ రామో బ్రహ్మతారకం అనిన్ని , రామతాపన్యుపనిషత్తులో రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదె నాసా పరబ్రహ్మ విధీయతే అనిన్ని సదా రామోహమస్మితి తత్వత: ప్రవదంతి ఏ నతే సంసారినో మానం రామ ఏవ న సంశయ: అనిన్ని వర్నింపబడుతవల్ల రాముడు సాక్షాత్ పరబ్రహ్మయే అని ద్రువపడుచున్నది. శ్రీ త్యాగరాజు కూడా రామ అను నామమును గురించి నారయనాష్టాక్షరి మంత్రమునకు జివబిజమైన రా అను అక్షరమునూపంచాక్షరీ మంత్రమునకు జివబిజమైన మా అను అక్షరమును కలిసి రామ అయిఇనది. కనుక రామ తత్త్వము పరబ్రహ్మయే అని కీర్తించాడు
Thursday, October 23, 2008
అందమైన నా చిన్ని లోకం
మా శ్రీవారు పాటలు బాగా పాడుతారు అంతే కాదు ఈల పాట కూడా ఎంతో బాగా వేస్తారు ......మా పిల్లలు కూడా బాగా పాడుతారు ......మరి పాడేవాళ్ళు వుంటే వినే వాళ్ళు వుండాలి కదా .......అది ఎవరో ఈ పాటికి గ్రహించే వుంటారు ......
ఇంకెవరు నేనేనండి .........ఇన్నాళ్ళ వాళ్ల సావాసం తో కొంచెంగా వాళ్లు పాడే దాంట్లో ఎప్పుడైనా తప్పులు వస్తే అది చెప్పగలుగుతున్నాను ..
మా చిన్నిబంగారు లోకం లో మేము నలుగురము ఎంతో ఆనందంగా వుంటాము ....అప్పుడప్పుడు కలహాలు కోపాలు తాపాలు మూతి ముడుచుకోవటం అంతలోనే నవ్వుకోవటం సరదాగా ఇందాక ఇలా కోపం తేచుకున్నాము అని పేరడీ పాటలు పాడుకోవటం ....ఇలా సాగే మా ప్రపంచంలోకి ఒక అబ్బాయి ప్రవేశించాడు .....అతని పేరు సుధీర్ ....అతను ఎవరా అనుకుంటున్నారా మా అల్లుడు .....మా అల్లుడు ఎంతో మంచి వాడు .....మాకు మా అబ్బైలాగా వుంటాడు .....ఈ విషయం లో మా అమ్మాయి మేము చాలా అదృష్టవంతులం ......మా సుధీర్ కవితలు రాస్తాడు
మిగిలిన విషయాలు ఈ సారి కలుసుకున్నప్పుడు చెప్పుకుందాము